- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
మండలంలోని గోపాల్పేట గ్రామంలో కొలువైన దుర్గామాతను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపాల్పేట్ గ్రామానికి చెందిన బెస్త సంఘయ్య నవనీతల కుమార్తె బేస్త కావేరి ఎంబిబిఎస్ లో సీటు సాధించడంతో విద్యార్థిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, మైనార్టీ అధ్యక్షులు ఫరీద్, లక్ష్మీకాంతం, వంశీ గౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -