- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కొండ రాజయ్య, బడితల వెంకటస్వామి, కొండ వంశీ నాన్నమ్మలు అనారోగ్యంతో బాధ పడుతూన్నారనే విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదివారం బాధిత కుటుంబాలను పరమార్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన రావిశెట్టి రాధమ్మ, రేగటి మణెమ్మ, పగడాల రాజవ్వల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



