- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు(మహముత్తారం)
మహాముత్తారం మండలం మాదారం గ్రామానికి చెందిన దాసరి వెంకటస్వామి,పి.మల్లమ్మ, కాటారంకు చెందిన మేకల సారయ్య,గంగారాంకు చెందిన హనుమంతులు అనారోగ్యంతో జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ తెలుసుకొని శుక్రవారం బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -