నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పెద్ద గుల్లా తండాలో పి ఆర్ టి యు రాష్ట్ర బాధ్యులు సంతోష్ రాథోడ్ బిచ్కుంద సతీమణి రేణుక రాథోడ్ ఇటీవలే మరణించడం జరిగింది. బుధవారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మండల బీ ఆర్ ఎస్ నాయకులతో కలిసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నేను ఉన్నానంటూ గుండె ధైర్యం, మనో ధైర్యం కల్పించి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దురదృష్టవశత్తు చిన్నవయసులోనే మరణించడం చాలా బాధాకరమని మండల బీఆర్ఎస్ నాయకులు తెలియజేయడం జరిగింది. పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే తో పాటు నాయకులు నీలు పటేల్ , వాస్రే రమేష్ , బొల్లి గంగాధర్ , శివాజీ పటేల్ , వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షిండే ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES