Sunday, June 1, 2025
E-PAPER
Homeఖమ్మంమండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా…

మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా…

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మూడో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శుక్రవారం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొత్తూరు లో శ్రీ సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ, గణపతి, శివలింగ, ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవంలో గ్రామస్థులు, ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన మెచ్చా కు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాండ్లగూడెం లో లావుఢ్యా శ్రీరామ్ మూర్తి  కుమారుడు వినోద్ వివాహం ఇటీవలే జరగగా ఆయన నివాసానికి వెళ్లి నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం విలేకరి మాలోత్ రామారావు మాతృమూర్తి ఇటీవలే మృతి చెందగా ఆమె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నేపద్యంలో కొత్తూరు మహిళా కూలీలు కొంద మెచ్చా తో మాట్లాడారు. “మీరే మాకు పోడు భూమి పట్టాలు ఇచ్చారు.రైతు బంధు కూడా వేశారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బందు లేదు,రూ.500 లు గ్యాస్ సిలిండర్ రాయితీ రావట్లేదు, మహిళలకు రూ.2500 లు పించన్ లేదు,200యూనిట్ల కరెంట్ లేదు,రూ.4000 పెన్షన్ లేదు.కేసీఆర్ ఇచ్చే పెన్షన్ కూడా సమయానికి రావట్లేదు అంటు వాపోయారు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయట్లేదు అసలు ఈ ప్రభుత్వం మీద నమ్మకమే లేదు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎవరు ఓటు వేయరు అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ “కొన్ని రోజులు ఓపిక పట్టండి మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది” అంటూ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమం లో మండల పరిషత్ మాజీ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి, మందపాటి  రాజ్ మోహన్ రెడ్డి, నవీన్ ,తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -