Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ…

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన మాజీ ఎంపీపీ…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
 భువనగిరి మండలంలోని  బస్వాపురం గ్రామంలో   భువనగిరి మాజీ ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్  జిల్లా పరిషత్ హై స్కూల్లో బడిబాట కార్యక్రమం లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పాఠశాలలో తరగతి గదుల ను సందర్శించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల ను, విద్యార్థులను ప్రోత్సహిస్తూ మంచి విద్యాబుద్ధులు నేర్పించగలరని ఉపాధ్యాయులకు కోరారు.  మొట్టమొదటి రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్ ని చేతుల మీదుగా అందజేశారు. భువనగిరి మండలం బస్వాపురం గ్రామ విద్యార్థులు భువనగిరి మండలంలో మొదటి  స్థానం తెచ్చినందుకు విద్యార్థులకు, స్కూలు ఉపాధ్యాయులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,  విద్యార్థులు

 పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad