- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ స్పీకర్ మధుసూదనా చారిను సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా తొర్రూరుకు వెళ్తుండగా ఆయనను అడ్డుకున్నట్లు సమాచారం. పోలీసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని మధుసూదనా చారి మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు మాత్రం చట్టం-శాంతి భద్రతల దృష్ట్యా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
- Advertisement -



