- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మారుతీనగర్ లో గల కృష్ణ మందీర్ లో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశానన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -