ఇద్దరు బీజేపీ నేతలు, మరో ఇద్దరు అనుబంధ సభ్యులు
నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాజ్యసభకు నలుగురు సభ్యులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. వీరిలో ఇద్దరు బీజేపీ సభ్యులు కాగా, మరో ఇద్దరు బీజేపీకి పరోక్షంగా అనుబంధంగా వ్యవహరించిన సభ్యులు ఉన్నారు. ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూట ర్, బీజేపీ నేత ఉజ్వల్ దేవరావు నికం, కేరళకు చెందిన బీజేపీ నేత సి. సదానందన్ మాస్టర్, మాజీ దౌత్యవేత్య హర్ష వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్ ఉన్నారు. నామినేటెడ్ సభ్యులతో కూడిన జాబితాను హౌం మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఎ)లోని క్లాజ్ (3) కింద రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని రాజ్యసభకు నామినేట్ చేసే ప్రత్యేక అధికారం రాష్ట్రపతికి ఉంది. విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా అమెరికా, బంగ్లాదేశ్, థారులాండ్కు అంబాసిడర్గా పనిచేశారు. 2023లో ఇండియా జి-20 ప్రెసిడెన్సీకి చీఫ్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. ప్రముఖ చరిత్రకారిణి, విద్యావేత్త మీనాక్షి జైన్ భారతదేశ నాకరికత, మత వారసత్వాన్ని చాటిచెప్పేందుకు విశేష కృషి చేశారు. విద్యా రంగంలో కృషికి 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సభ్యురాలిగా పనిచేశారు. ఉజ్వల్ దేవరావు నికమ్ 26/11 ముంబాయి ఉగ్రదాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను విచారించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున ముంబయి నార్త్ సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్ చేతిలో ఓటమి చెందారు. కేరళకు చెందిన బీజేపీ నేత సి. సదానందన్ మాస్టర్ త్రిసూర్లో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తించారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి, ఓటమి చెందారు.
రాజ్యసభకు నలుగురు
- Advertisement -
- Advertisement -