బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా ఇంచార్జ్ మహిపాల్
నవతెలంగాణ – కంఠేశ్వర్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్ వద్ద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ మహిపాల్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు వీరిలో 90% విద్యార్థులు తమ చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్నవారు. కాబట్టి ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం శక్తి వృధా కాకుండా ఉంటుంది.
చదువుపై మరింత శ్రద్ధ పెడతారు. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. కొంతమేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది. తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తు కలెక్టర్ కి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు సుమన్, ప్రేమ్, జిల్లా నాయకులు సాగర్ చారి, మల్లేష్ యాదవ్, మధుసూదన్, రమేష్, సుభాష్, ప్రశాంత్, మురళి,ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES