- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని దోస్త్ పల్లి గ్రామంలో నరేంద్ర మహారాజ్ ఉప పీఠం వద్ద ఉచిత హెల్త్ కంపెనీ నిర్వహించడం జరిగిందని జుక్కల్ ఆర్ఎంపి వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ ఎం పి డాక్టర్ వైద్యుడు సుధాకర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతమైన జుక్కల్ ప్రాంతంలో నిరుపేదలు అధికంగా ఉంటారని అన్నారు. వారి ఆరోగ్యం కోసం ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశామని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు ఏమైనా సమస్య ఉంటే ఉచిత హెల్త్ కార్యాలయాన్ని సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం వారికి ఉచితంగా మందులు కూడా అందజేస్తామని తెలిపారు.
- Advertisement -



