- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
కామారెడ్డి జిల్లా సదాశివ మండలం తుక్కొజివాడి గ్రామంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని తుక్కొజివాడి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు సర్పంచ్ దొడ్లే సంగారావు తెలిపారు. వైద్య పరీక్షలు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సౌజన్యంతో ఉచితవైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సాధారణ వైద్య పరీక్షలు మందులు అందించినట్లు పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది, పాలకవర్గం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



