Sunday, September 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజరాజేశ్వరీ నగర్ లో ఉచిత వైద్య శిబిరం

రాజరాజేశ్వరీ నగర్ లో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

సీజనల్ వ్యాధులపై అవగాహన
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
 మండలంలోని రాజరాజేశ్వరీ నగర్ లో కమ్మర్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహస్వామి పాల్గొని వైద్య సేవలు అందించారు. శివరాత్రి హాజరైన ప్రజలను పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం సీజనల్ వ్యాధులపై ఇంటింటికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

దోమలు వృద్ధి చెందకుండా పాడైన పాత వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని సూచించారు. జ్వరాలు వస్తే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేసి రక్త పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారి ఆకుల మారుతి, పంచాయితీ కార్యదర్శి రాఘవేందర్, ఏఎన్ఎంలు అరుణ కుమారి, సన, ఆశ కార్యకర్తలు శారద, పద్మ, శాంత, రాధా, వినీల, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -