- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్లలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎం.వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఈ వైద్య శిబిరంలో వివిధ రోగాలకు సంబంధించిన 73 మంది రోగులకు షుగర్,బీపీ,డెంగ్యూ,మలేరియా తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, రోగుల సంబంధిత టెస్టులు చెసి వారిని ఈహెచ్ఎంఐఎస్, ఓపిడి ఎంటర్ చేసి వారికి సంబధించిన మందులు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే వర్షా కాలం సీజన్లో పాటించాల్సిన సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ క్యాంపులో పంచాయతీ కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -