వందల సంఖ్యలో పాల్గొన్న గిరిజనులు, గిరిజనేతరులు
నవతెలంగాణ – తాడ్వాయి
“ఆరోగ్య మిత్ర..! ఆరోగ్య యాత్ర..!” తెలంగాణ సీనియర్ రెసిడెన్సి డాక్టర్స్ ఆధ్వర్యములో మండలంలోని దామెరవాయి గ్రామంలో ఆదివారం ఆరోగ్య అవగాహన మరియు సీజనల్ వ్యాధుల నివారణ గురించి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఉచితంగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉచిత వైద్య శిబిరానికి 100 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు వచ్చారు. ప్రతి రోగిని శ్రద్ధతో పరిశీలించి, పరీక్షించారు. గిరిజనులు, గిరిజనేతరులు బారులు తీశారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వైద్యులు, వైద్య విద్యార్థులు ప్రతి ఒక్కరిని జనరల్ చెకప్ చేసి ఉచితంగా మందులు పంపించేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం అయింది కనుక సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. సీజనల్ వ్యాధులు ఆరోగ్య చిట్కాలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో దామెరవాయి తాజా మాజీ సర్పంచ్ నూశెట్టి సరితరమేశ్, కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశాలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి కొత్తూరు రోహిత్, యూత్ నాయకులు కార్తీక్, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ నరేష్ కుమార్, డాక్టర్ సాబ్, డాక్టర్ ప్రవీణ్, నవదీప్, లోకేష్, హర్షవర్ధన్, కెఎంసి ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, 400 మంది రోగులు, తదితరులు పాల్గొన్నారు.