- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గంలోని నందిపేట మండలంలోని షాపూర్ గ్రామం యందు శనివారం ఆయుష్ శాఖ డైరెక్టర్ వీ.డి. ఆర్. రెడ్డి ఆదేశానుసారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించినారు. హైదరాబాద్ జెఎస్పిఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల వైద్యులు, జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో రోగ పరీక్షలు, మందుల పంపిణీ, రోగనిర్ధారణ పరీక్షలు, స్త్రీలకు, పిల్లలకు సీజనల్ వ్యాధులు, యోగా వలన లాభాల పై ప్రజలకు అవగాహన కల్పించినారు. 200కు పైగా ప్రజలకు పరీక్షలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ జీర్జీ ముల్లార్, శ్రీకాంత్, అనిత, ప్రీతం, డాక్టర్ ప్రవీణ, వి డి సి సభ్యులు, మాజీ సర్పంచ్ మురళి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -