- Advertisement -
నవతెలంగాణ – మోపాల్
మండలంలోని కాస్బాగ్ తండాలో సర్పంచ్ సదాసింగ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 86 పైబడి గ్రామ ప్రజలకు ఉచిత వైద్యంతోపాటు మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సదాసింగ్ మాట్లాడుతూ.. గ్రామానికి ఒక సర్పంచ్ లాగా కాకుండా ఒక సేవకుడి లాగా ఉంటానని, అనుక్షణం గ్రామ అభివృద్ధి పాటు పడుతూ భూపతిరెడ్డి సహకారంతో, స్వచ్ఛంద సంస్థల సహకారంతో తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే విధంగా చూస్తానని ఆయన తెలిపారు.
- Advertisement -



