సంతానం లేని వారికి ప్రత్యేక వైద్యం
విష్ ఫర్టిలిటీ డాక్టర్. కిరణ
నవతెలంగాణ – డిచ్ పల్లి : మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్యం అందజేసినట్లు విష్ ఫర్టిలిటీ డాక్టర్. కిరణ టి. పేర్కొన్నారు. అదివారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో విష్ ఫర్టిలిటీ డాక్టర్. కిరణ టి (ఎంఎస్.ఒబిజి.ఎఫ్ ఎన్ బి ) ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం, సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 60 మంది మహిళలు పాల్గొన్నారు. వైద్య శిబిరానికి హాజరైన అందరికీ డాక్టర్ కిరణ టి వైద్య సలహాలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. విష్ ఫర్టిలిటీ హాస్పిటల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలోని డాక్టర్. కిరణ ఎంఎస్ .ఒబిజి, ఎఫ్ ఎన్ బి డిగ్రీ పూర్తి చేసిన వారిలో రెండవ వారన్నారు. మొత్తం తెలంగాణలో పేర్కొన్న ఎంబిబిఎస్ డిగ్రీ చదివిన వారు ముగ్గురు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరల నుండి నిజామాబాద్ నగరంలో తమ సేవలను అందిస్తూ ఇప్పటివరకు 2500 నుండి 3000 స్త్రీలకు మాతృత్వ సౌభాగ్యాన్ని కలిగించిన డాక్టర్ కిరణ నిజామాబాదులో ఉండడం, జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో పి ఎం పీ,అర్ ఎం పి ఇందల్ వాయి మండల అధ్యక్షులు జనార్దన్, గణేష్ వేముల, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES