Friday, June 20, 2025
E-PAPER
Homeజిల్లాలుఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక

ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక

- Advertisement -

–  ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
: ఇందిరమ్మ ఇండ్ల గృహాల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి అవసరమైనంత ఇసుక, మొరము ఉచితంగా అందించడం జరుగుతుందని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావలసిన లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శి ద్వారా ఇండెంట్ సమర్పించినట్లయితే వారికి అవసరమైన ఇసుక, మొరం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇసుక అయితే ఉప్లూర్, నాగాపూర్, రాజరాజేశ్వరి నగర్, కమ్మర్ పల్లి గ్రామాల లబ్ధిదారులకు ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ నుండి మిగిలిన గ్రామ పంచాయతీ లబ్ధిదారులందరికీ భీంగల్ మండలంలోని ఇసుక రీచ్ ద్వారా ఇసుక ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఇందిరా నిర్మాణ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రకటనలు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -