- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని శివన్నగూడ గ్రామంలో శుక్రవారం మండల పశు వైద్య మరియు పశు సంవర్ధ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. శిబిరంలో 14 గేదెలకు 4 ఆవులకు చూడి పరీక్షలు,9 గేదెలకు 6 ఆవులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు,10 గేదెలకు 4 దూడలకు సాధారణ చికిత్సలు చేయడం జరిగింది. అదేవిధంగా గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా 46 ఆవులకు మరియు ఎద్దులకు,62 గేదెలకు మరియు దూడలకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్, డాక్టర్ ఎం. యమున,పసిముద్దీన్,సుధాకర్, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



