Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్ఈసాయి పేటలో ఉచిత పశువైద్య శిబిరం..

ఈసాయి పేటలో ఉచిత పశువైద్య శిబిరం..

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి: కామారెడ్డి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పాల్వంచ మండలంలోని ఈసాయి పేట్ గ్రామంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ పశు వైద్య శిబిరంలో  పశు సంవర్దక శాఖ వైద్యులు గ్రామంలోని పశువులకు ఉచితంగా గాలికుంటూ టీకా, గర్భకోశ వ్యాధి శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో (32) పశువులకు గర్భకోశా వ్యాది చికిత్సలు, (18) పశువులకు చుడి పరీక్షలు, (15) దూడలకు నట్టల మందులు వేశారు. ఈ  కార్యక్రమంలో కామారెడ్డి మార్కెట్ కమిటీ  డైరెక్టర్లు సుదర్శన్ రావు, భూపతి, భూమయ్య, రాజలింగం, జ్యోతి రెడ్డి, ఏఎంసీ కార్యదర్శి ధర్సింగ్ , రమేష్, వైద్యులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ అనిల్ రెడ్డి, డాక్టర్ మౌనిక,   డాక్టర్ హేమశ్రీ, పశు వైద్య సిబ్బంది, ఎల్ ఎస్ ఏ  మాహేష్, ఓఎస్  రిజ్వాన్,  పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -