Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస కొత్తూర్ లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం

హాస కొత్తూర్ లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ లో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రైడే-డ్రైడే  కార్యక్రమాన్ని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ పరిశీలించారు. ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి కుండిలను, పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పనికి రాని టైర్లు, బకిట్లలో, త్రాగిన కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదన్నారు. ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని, వాడకుండా ఉన్న కూలర్లలో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా, దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్  మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని, దానిని కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంట్లోని చెత్తను వీధిలో, మురికి కాలువలలో పాడేయకుండా ఇంటిలోనే తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా గ్రామ పంచాయతీ ద్వారా అందించిన చెత్తబుట్టలో నిల్వ ఉంచుకొని  గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులోనే వేయాలన్నారు. ఈ  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -