ప్రజలకు సేవ చేసేందుకే వైద్యుడిని అయ్యాను
వైద్యుడిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కింది
కన్సల్టెంట్ ఫిజీషియన్ క్రిటికల్ కేర్, డయాబెటిస్, బి.పి అండ్ థైరాయిడ్లో నిపుణుడు డాక్టర్ సృజిల్ బాబు తేడ్డు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : వైద్యుడిగా ప్రజలకు తన వంతు సేవ చేసే భాగ్యం దక్కినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ సృజిల్ బాబు తెలిపారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి డాక్టర్ కావాలనే లక్ష్యంతో చదివి డాక్టర్ అయి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మాది నిజామాబాద్ జిల్లా బీంగాల్ మండలం, ముచ్కూర్ గ్రామానికి చెందిన తెడ్డు బాబు, జమునా దంపతులకు పెద్ద కుమారుడిని. నా విద్యాభ్యాసం కమ్మర్ర్ పల్లి మండల్, హాస కొత్తూరులో పదవ తరగతి వరకు చదివి, ఇంటర్ నిజామాబాద్ లో చదివాను. ఆ తర్వాత ఎంబీబీఎస్ మమత మెడికల్ కాలేజ్ ఖమ్మంలో చదివి ముంబైలోని బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్ లో పీజీ పూర్తి చేశాను.
ఆ తర్వాత రెండు సంవత్సరాలు ముంబైలో ప్రాక్టీస్ చేసిన అనంతరం గత నాలుగు సంవత్సరాలుగా నిజామాబాదులో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నాను. నాలుగేళ్ల క్రితం తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారంతో ఆస్పత్రి ప్రారంభించాను. వైద్య సేవలతో పాటు ప్రతి సంవత్సరం జిల్లాలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ.. మందులను సైతం ఉచితంగా అందజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో పుట్టినందుకు ఇక్కడి ప్రజల కుఅందుబాటులో ఉంటూ హైదరా బాద్ కు వెళ్లకుండా అతి తక్కువ ఖర్చుతో తన ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాను. సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని, అందుకోసమే ప్రతి గురువారం తమ ఆస్పత్రిలో ఓపి ఉచితంగా చూస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ డే ను పురస్కరించుకొని నిజామాబాద్ వైద్యులందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు తెలిపారు.