Monday, June 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విధ్వంసం నుంచి.. అభివృద్ధి వైపు అడుగులు

విధ్వంసం నుంచి.. అభివృద్ధి వైపు అడుగులు

- Advertisement -

ఎమ్మెల్యే వేముల వీరేశం..
గత పాలకుల నిర్లక్ష్యంతో నకరేకల్ నియోజవర్గం విధ్వంసానికి గురై సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో తాగునీటి ప్రాజెక్టులు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. సాగు త్రాగునీటి ప్రాధాన్యత క్రమంలో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టును ఇప్పటికే ప్రారంభించుకున్నాం, ఐటి పాముల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పూర్తి చేసేందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం, నార్కట్ పల్లి బస్ డిపో మూతపడిన స్థితి నుంచి పూర్వవైభవం పొందే దిశగా డిపోకు నూతన బస్సులు కేటాయింపు, పూర్తిస్థాయిలో ఫంక్షన్ కోసం ప్రయత్నాలు చేసినట్లు వెల్లడించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక సంచిక వెలువడుతున్న నేపథ్యంలో నవతెలంగాణ  నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి ఎండి.సాదత్ అలి ఎమ్మెల్యే వేముల వీరేశంతో ముఖాముఖి.

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి:

నవతెలంగాణ: జన్మదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే గారూ..
ఎమ్మెల్యే:  థాంక్యూ..
నవతెలంగాణ: ప్రభుత్వం ఏర్పాటు జరిగిన అనంతరం17 నెలల కాలంలో నకరేకల్ నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంది.? మీరు ఎలా భావిస్తున్నారు.?
ఎమ్మెల్యే: నియోజవర్గ అభివృద్ధి తృప్తికరంగా ఉంది సంతోషకరంగా ఉంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన ప్రభుత్వం, గడచిన పాలకులు, గడిచిన ముఖ్యమంత్రి, ఒక దయనీయమైన  పరిస్థితికి దిగజార్చి, ఒక ఘోరమైన పరిస్థితిలోకి తీసుకెళ్ళారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో అనేకం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయక నత్తనడకనిచ్చి ఆస్తవ్యస్తంగా మార్చిన పరిస్థితుల్లో జిల్లా మంత్రులుగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డికి అభివృద్ధి  బాధ్యతలు అప్పగించారు. మంత్రులు ఒక్కొక్కటిగా సరిచేస్తూ.. సవరిస్తూ.. ప్రధానంగా ఇరిగేషన్ రంగంపై కాన్సన్ట్రేషన్ చేసి, వేగంగా ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసే ప్రక్రియను చేపట్టారు. మా ప్రభుత్వం చేస్తున్న పనులను చూస్తుంటే నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ముఖ్యంగా రైతాంగానికి నీరు అందిస్తే, పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనది వ్యవసాయ రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రం. మన నియోజవర్గంలో పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడి బ్రతుకునీడుస్తున్నవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి నీరు అనేది ప్రధానం. వీటి మీదనే దృష్టి సారించి, కేంద్రీకరించి పని చేస్తున్నందుకు చాలా చాలా సంతోషకరంగా ఉంది. 
నవతెలంగాణ: రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బ్రాహ్మణ వెల్లంల  ఉదయ సముద్రం ప్రాజెక్టుతో పాటు, కట్టంగూర్ ఐటి పాముల రిజర్వాయర్ పూర్తి చేసేందుకు, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. నిధులు లేని క్రమంలో వీటిని ఎలా పూర్తి చేస్తారు.?

ఎమ్మెల్యే:  ఉన్నదాంట్లో ప్రిఆర్టీ ప్రకారం బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు, గడచిన పది సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేశారు. మా ప్రభుత్వం రాంగానే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో నీళ్లు నింపి కెనాల్సి పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. నకరేకల్ నియోజకవర్గానికి 61 వేల ఎకరాలకు నీరు రావలసింది ఉంది. రైల్వే క్రాసింగ్, జాతీయ రహదారి, క్రాసింగ్ గాని పూర్తి చేసి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం దానికి కావలసిన నిధులను ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఎన్ని కష్టాలు ఉన్నా.. సమకూర్చుకోవడానికి ప్రభుత్వం సీరియస్ గా పనిచేస్తోంది. ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ప్రాజెక్టులతో పాటు పిళ్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువ వీటిని  పూర్తిచేసే కార్యక్రమం ఐటి పాముల లిస్టును పూర్తి చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఇరిగేషన్ మంత్రి కృషి చేస్తున్నారు. 

నవతెలంగాణ: ఎంత ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఎమ్మెల్యే: ఐటి పాముల లిఫ్ట్ వచ్చేసి రూ.100 కోట్లపై చిలుకు ఖర్చవుతుంది. బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రానికి సంబంధించి ఇంకా రెండు వేల ఎకరాలు భూమి సేకరించాల్సి ఉంది. 200 ఎకరాల  భూసేకరణలో అప్రోచ్ కాలువలను పూర్తి చేసి  చెరువులు నింపి, ఆ చెరువుల నుంచి గొలుసుకట్టు చెరువులను లింకప్ చేసి మొదట ప్రాధాన్యాత కింద 50వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. కావలసిన నిధులను ఫేస్ వైస్ గా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మిగిలిన పనులను పూర్తి చేయడానికి వేగంగా పనిచేస్తుంది. 

నవతెలంగాణ: నకరేకల్ నియోజకవర్గంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇచ్చిన హామీలు రెండవసారి ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు స్వీకరించే ముందు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలైందని భావిస్తున్నారు.?
ఎమ్మెల్యే: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 16 నెలలు పూర్తయింది. ఈ 16 నెలల కాలంలో దాదాపు సంక్షేమానికి గాని, అభివృద్ధి కానీ రూ.1300 కోట్లు తీసుకొచ్చాం. మీడియా ద్వారానే ఏడాది పాలన సంబరాల్లో ఇప్పటికే ప్రకటించాం. మిగతా ఆరు నెలల కాలంలో మా పాలన సంతృప్తికరంగా ఉంది. ఐటి పాముల లిఫ్ట్ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు గానీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, 100 పడకల ఆస్పత్రి, పూర్తి చేయడం గాని, కొత్తగా రహదారులు ఏర్పాటు చేయడం సంతృప్తికరంగా ఉంది. దీంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు ఇందిరమ్మ ఇల్లు సన్న బియ్యం పథకం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, రాజీవ్ యువ వికాస్ పథకాలు ఇవన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రజలు కూడా ఏదో ఒకటి చేస్తున్నారని భావనలో ఉన్నారు. ఏడాదిన్నర పాలన సాగిందని భావిస్తున్న. 
నవతెలంగాణ: ఏడాదిన్నర పాలన కాలంలో మీ యొక్క పనితీరుపై ఎన్ని మార్కులు వేసుకుంటారు.? ఎంత శాతం అనుకుంటున్నారు.?
ఎమ్మెల్యే: మార్కులు మనకు మనమే వేసుకుంటే జబ్బలు సరుసుకున్నట్టే. ప్రజలకు సంబంధించి అందుబాటులో ఉంటాను అని మాట ఇచ్చి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం ఎవరైనా  నేరుగా నా దగ్గరికి వచ్చి పని చేయించుకోవచ్చు అని ప్రకటించాను. నేను అదే ప్రయత్నంలో నా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సాగుతున్న నా ప్రయాణంలో తప్పొప్పులు ఉంటే ప్రజల నుంచి సూచనలు స్వీకరించి అమలు చేస్తా. 

నవతెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సును ప్రారంభించే క్రమంలో నార్కట్ పల్లి బస్ డిపోను పునరుద్ధరిస్తాం.. పూర్వ వైభవం తెస్తా అని ప్రకటించారు. ఇది పూర్తిస్థాయిలో అమలు జరగలేదని ఆరోపణలు ఉన్నాయి. మీరు ఎలా స్పందిస్తారు.?
ఎమ్మెల్యే: గడచిన పాలకులు వచ్చేసి డిపోను రద్దు చేశారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రతినిధులు డిపోను ఆక్రమించి ఆ స్థానంలో ఫంక్షన్ హాల్ నిర్మించాలని ప్రయత్నం చేశారు. మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఆ ప్రయత్నాన్ని  ఆపగలిగాం.  పూర్తిస్థాయిలో ఫంక్షన్ కు కావలసిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాకు కేటాయించిన బస్సులలో ప్రతిసారి ఒకటో రెండో బస్సులను డిపోకు అలాట్ చేయిస్తున్నాం. డిపో మేనేజర్ లేని స్థితి నుంచి మేనేజర్ స్థాయి అధికారిని నియమించాం. డిపోను పునరుద్దించేందుకు అన్ని రకాల చర్యలు సీరియస్ గా చేస్తా ఉన్నాం . గతంలో ఉన్నవారు ఇక్కడ ఉన్న బస్సులను నల్లగొండ యాదగిరిగుట్ట హయత్ నగర్ సూర్యాపేట డిపోలకు కేటాయించారు. నార్కట్ పల్లి డిపోను జీరో చేశారు. డిపోని కేవలం వచ్చిపోయే బస్సు ల బస్టాండ్ గా మార్చేశారు. డిపోను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసిన స్థాయి నుంచి రద్దు చేసిన స్థాయి నుంచి పూర్తిస్థాయిలో మూసేసిన  స్థాయి నుంచి పునరుద్ధరించి పూర్వ  వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఇచ్చిన హామీ ప్రకారం 100కు 100% పూర్తి చేస్తాం. డిపోను పునరుద్ధరిస్తాం.  పూర్వ వైభవం తీసుకొస్తాం.
నవతెలంగాణ: గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టించి, జాతీయ రహదారులు, గ్రామాల్లో ఉన్న రహదారులను నిర్మాణం చేపడతామని శంకుస్థాపనలు చేసి వదిలేసిన క్రమంలో డిసెంబర్ 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామీణ ప్రాంతాల రోడ్లను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. నేటి వరకు అవి పనులు ప్రారంభం కాలేదు, వీటిపై మీరు ఎలా స్పందిస్తారు.?
ఎమ్మెల్యే : గత కాంట్రాక్టర్లు చేసిన పనుల కు  బిల్లులు  ఆగిపోయినాయి. గత ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టింది. గత ప్రభుత్వంలో ప్రారంభమైన నార్కట్ పల్లి పాత జాతీయ రహదారి, పనులు అదేవిధంగా నకిరేకల్, రామన్నపేట సంబంధించిన రహదారులు పూర్తికాలేదు.  కారణమేంటంటే బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి నిర్మాణాలు సగం వరకు చేసి  వదిలేశారు. మేము వదిలేసిన పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం. ఇంకొక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది ఏమిటంటే.. ప్రభుత్వ  మంజూరు లేకపోయినా శంకుస్థాపన చేసి, వదిలేశారు. తిరిగి ఆ పనులను పూర్తి చేయాలని ఆలోచనతో కొత్తగా మంజూరు కోసం ప్రయత్నం చేస్తే ఇంతకుముందే అయినట్టు రికార్డులో చూపిస్తుంది . ప్రొసీడింగ్స్ ఇచ్చేసి సాంకేతికంగా అనుమతులు లేకుండా ఫైనాన్షియల్ అనుమతులు లేకుండా చేశారు. మా ముఖ్యమంత్రి, మంత్రులు గాని స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్రంలో కేవలం ఎనిమిది లక్షల కోట్ల అప్పు మాత్రమే కాదు, ప్రతి డిపార్ట్మెంట్,  ప్రతి వ్యవస్థను, ప్రతి సిస్టంను బ్రష్టు పట్టించారు. బ్రష్టు పట్టించిన విధానాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకే మాకు ఇంత సమయం పట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గానికి రూ.500 కోట్లు నుంచి రూ.1000 కోట్ల వరకు ప్రొసీడింగ్స్ ఇచ్చేసి  కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోయారు. టెండరింగ్ లేదు, ప్రాసెసింగ్ లేదు, సాంకేతిక అనుమతులు లేవు,  ఇలా అన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారు చేశారు.

ఇన్ పాముల గ్రామంలో పురాతన శివాలయం ఉంది. కింది నుంచి పై వరకు కోటి రూ.50 లక్షలతో రోడ్డు నిర్మిస్తామని,  గట్టు పైన రూ.5 కోట్లతో గుడి నిర్మాణం చేపడతామని, శంకుస్థాపన చేశారు. ఎక్కడ కూడా ప్రొసీడింగ్స్ లేవు, అనుమతులు లేవు, ఆ పనిని ఏం చేయాలన్న ?  చేసే పరిస్థితి లేదు. చూశారా నేను చేసిన పనిని పూర్తి చేయలేదు అపవాదం మా మీద వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు చేసింది ఏమన్నా ఉందా అంటే విధ్వంసం తప్ప ఏమీ లేదు. ఓట్ల కోసం ప్రజలను మభ్య పెట్టడం కోసం చేశారు తప్ప పారదర్శకంగా చేయలేదు. ఒక పారదర్శకమైన పాలన పారదర్శకమైన సిస్టం పారదర్శకమైన ప్రణాళిక, విజన్ తో, స్టార్ట్జితో రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో సరి చేసుకోవడానికి సమయం పట్టిందని ప్రజలు అర్థం చేసుకుంటారు. 

నవతెలంగాణ: నియోజకవర్గంలో విద్యా వైద్య, ఉపాధి మెరుగుపరిచేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటి? 
ఎమ్మెల్యే: ఇప్పటికీ మన నియోజకవర్గంలో ప్రయివేటు పాఠశాలకు  ధీటుగా.. పాఠశాలలో క్లోజ్ కాకముందే మనం బడిబాట కార్యక్రమం పెట్టడం జరిగింది. నకిరేకల్ నియోజకవర్గంలో ప్రారంభమైన తర్వాతనే అన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. నియోజవర్గంలో విద్య పట్ల మాకు నాయకులకు చిత్తశుద్ధికి ఉదాహరణగా.. చెప్పవచ్చు. దానికి తోడు విద్యావస్థను  బలోపేతం చేయడానికి ఇక్కడ ఉన్న ఎంఈఓ లతో, సంబంధిత అధికారులతో, డిస్కషన్ చేసి చర్చించి అనేక రకాల పద్ధతిలో స్కూళ్లను ఎన్రోల్మెంట్ పెంచేందుకు, పాఠశాలను బాగు చేసుకునేందుకు కృషి చేశాం. ఈ క్రమంలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ను పూర్తి చేయాలంటే ప్రతి పాఠశాలలో గత పది సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులచే సమావేశాలు ఏర్పాటు చేసే ప్రణాళికలు చేసి, వాళ్ల సహకారంతో మనబడిని బతుకిచ్చుకోవాలని అని ఆలోచనతో ఆవశ్యకతను అవసరాన్ని నొక్కి చెప్పాలని  ఒక ప్రయత్నం చేస్తున్నాం. విద్య రంగాన్ని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగానే డిగ్రీ కళాశాలను నిర్మించడం, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మాణం చేపట్టేందుకు మంజూరు చేయించుకోవడం విద్యారంగాన్ని బలోపేతం చేయడం  కోసం సీరియస్ గా ప్రయత్నం  చేస్తున్నాం.

నవతెలంగాణ: నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్నత విద్యా వ్యవస్థలో జూనియర్ కళాశాలకు డిగ్రీ కళాశాలకు పూర్తిస్థాయిలో సొంతభవనాలు లేవు కదా?
ఎమ్మెల్యే: నియోజవర్గంలో రామన్నపేట నకిరేకల్ పట్టణంలో డిగ్రీ కళాశాలకు నడుస్తుంది సొంత భవనం లేదు. సొంత భవనం నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాం, రామన్నపేట నకిరేకల్లో జూనియర్ కళాశాలకు సొంత భవనం ఉంది.  నార్కట్ పల్లిలో విద్యార్థుల నమోదు బలోపేతం చేసి అక్కడ కూడా సొంత  భవన నిర్మాణం చేసేందుకు కృషి చేస్తాం. 

నవతెలంగాణ: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తిస్థాయిలో సదుపాయాలు లేవని ఇక్కడ ప్రజలు, అనేక రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా మీరు సైతం అనేకమార్లు మంత్రుల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది, వీటిని అధికమించేందుకు మీరు ఏ లాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
ఎమ్మెల్యే: అంటే ఇందులో రెండు జరిగినాయి. ప్రభుత్వ కార్యాలయాలు గతంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు గాని అంతకుముందు గత ప్రభుత్వంలో మండల పరిషత్ కార్యాలయం ఉండేవి. కానీ రెవెన్యూ కార్యాలయం కానీ, డి ఈ, ఏ ఈ, కార్యాలయాలను గత పాలకులు ధ్వంసం చేశారు. విచ్ఛిన్నం చేశారు. పున నిర్మాణం చేయడం కోసం నేను మార్కెటింగ్ శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేసి ఇక్కడున్న మార్కెట్ ప్లేస్ ను ప్రభుత్వ కార్యాలయాలకు అడగడం జరిగింది. దాంతోపాటు 100 పడకల ఆస్పత్రికి కాంగ్రెస్ గవర్నమెంట్ లో షిఫ్ట్ అవుతున్న తర్వాత మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ భవనం కూడా సరైన వసతులతో లేదు. ఆ భవనాన్ని కూడా అడిగాం. ఆర్ అండ్ బి శాఖ వారిని అడగడం జరిగింది. అక్కడ స్థలంలో ప్రభుత్వ కార్యాలయం నిర్వహించుకుంటాం. ఆర్ అండ్ బి శాఖకు వేరే చోట స్థలం కేటాయిస్తామని కోరాం. ఈ ప్రాంతంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడితే మున్సిపల్ కు ఆదాయ వనరులు ఏర్పడతాయని అడిగాం, ఇలా మొత్తంగా కోఆర్డినేషన్ చేస్తూ ఎంత సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు విచ్చేసినప్పుడు తాసిల్దార్ కార్యాలయం నిర్మాణాన్ని మంజూరు చేస్తానని ప్రకటించడం జరిగింది. అది మంజూరు అయిన తర్వాత ఆ స్థలాన్ని మేము స్వాధీనపరుచుకొని తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో, ఏ ఈ,, డి ఈ కార్యాలయాలను అనేక ప్రభుత్వ కార్యాలను ఒకే చోట నిర్మాణం చేసి ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నం చేస్తాం. 

నవతెలంగాణ: మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గతంలో సైతం సేవా కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే నీ మానస పుత్రిక ఉద్దీపన ద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేశారు. ఈ క్రమంలో మీ జన్మదిన సందర్భంగా నకరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఏం బహుమానం ఇవ్వబోతున్నారు. 
ఎమ్మెల్యే: నేను ప్రజలకు కానుక ఇచ్చేంత శక్తివంతున్ని కాదు, ప్రజలే చరిత్రకారులు ప్రజలే నిర్మాతలు, ప్రజల సేవకునిగా నా శక్తి మేరకు సేవ చేస్తా, అందుబాటులో ఉంటా, ప్రతి సమస్యను న్యాయ పక్షాన ఉండేవిధంగా ప్రయత్నం చేస్తా, గత జన్మదిన సందర్భంగా భీమాను అమలు చేస్తానని మాట ఇచ్చాను. దానికి కట్టుబడి ఉంటా. దానికి కావలసిన విధివిధానాలను తెలుసుకుంటున్నాం త్వరలోనే ప్రకటిస్తాం. 

నవతెలంగాణ: నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కొత్త పాత విభేదాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి .. వీటి పైన మీ స్పందన ఏమిటి? 
ఎమ్మెల్యే: ఒకసారి కాంగ్రెస్ పార్టీ అనే సభ్యత్వం తీసుకున్న తర్వాత కొత్త పాత అనే విభేదాలు ఉండవు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీవారే. పాత కొత్త అనే తేడాలు ఏవి ఉండవు. సహజంగా పార్టీ విధానాలు పార్టీ ఐడియాలజీ, నచ్చి వచ్చిన వారందరికీ పార్టీ ఒకసారి పార్టీలోకి తీసుకుందంటే వారి యొక్క అవసరాన్ని బట్టి పార్టీలోకి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. కాకపోతే అన్ని పార్టీల్లో సైతం సీనియర్ జూనియర్ అనే భావన ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యక భావాలు కలిగిన పార్టీ. ఎక్కువ శాతం స్వేచ్ఛ కలిగిన పార్టీ. అన్నింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే శక్తివంతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో పార్టీ సిస్టంలో నేను అయినా సామాన్య కార్యకర్త అయినా సమానమే. నేను సిస్టంలో క్రమశిక్షణగా వెళ్లినప్పుడు అవకాశం వర్తిస్తుంది. అది ఎవరికైనా వర్తిస్తుంది. 

నవతెలంగాణ: నియోజకవర్గంలో నార్కట్ పల్లి మండలంలో ఉన్న చెరువుగట్టు దేవస్థాన అభివృద్ధికి మీ ప్రభుత్వం పాటుపడడం లేదు. కనీసం పాలకవర్గ కమిటీని కూడా నియమించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు.?
ఎమ్మెల్యే: దేవాలయ కమిటీ అనేది గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత ఏర్పాటు చేస్తాం. అప్పటివరకు చెయ్యం. తర్వాత ఆలయ అభివృద్ధి అనేది పూర్తి అధికారాలు హక్కులను దేవదాయ శాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది.  సక్రమంగా  నడిపే బాధ్యతను అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే అక్కడ జరిగినటువంటి తప్పులు,  అవినీతిపై చర్యలు తీసుకోవాలి కాబట్టి చర్యలు తీసుకోనే బాధ్యత అధికారులపై ఉంటది కాబట్టి అధికారులపై పెట్టాం. ఆ దేవస్థానం విషయంలో జనరల్ గా సెంటిమెంట్ ఉంటది. శివాలయం ఆలయంలోకి ఎవరు వెళ్లినా దర్శనం చేసుకున్న తర్వాత బయట కాలభైరవుని విగ్రహం ఉంటది. అక్కడ చేతులు, కాళ్లు దులిపి రావడం ఆనవాయితీ. ఎందుకంటే మేము ఖాళీ చేతులతోనే వచ్చాం.. ఖాళీ చేతులతోనే వెళుతున్నాం.. అనే సెంటిమెంట్. అలా ఏమంటిన నష్టం వాటిల్లుతుంది. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఈ సెంటిమెంట్ ను నమ్ముతారు. కాబట్టి అక్కడ ఎలాంటి అవినీతి మచ్చ గాని అక్రమాల మచ్చ గాని అంటించుకోవడం కానీ తగిలించుకోవడానికి కోసం మా పార్టీకి సంబంధించిన వారు ఎవరు సిద్ధంగా లేరు. దేవస్థానంపై జరిగిన అవినీతిని గాని అక్రమాలను సరిజేసే పనిని పూర్తిస్థాయిలో పై అధికారులకు అప్పజెప్పడం జరిగింది. పై స్థాయి అధికారులు చర్యలు తీసుకొని ప్రక్షాళన చేసిన తర్వాత కమిటీ వేస్తాం. 

నవతెలంగాణ: భక్తులకు కావలసిన కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అధికారులు విఫలమవుతున్నారు. దానిని పర్యవేక్షించడంలో మీరు సైతం అవేవి పట్టించుకోవడం లేదు కదా? 
ఎమ్మెల్యే: అధికారులపైనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులపైనే సమాచార హక్కు చట్టం ద్వారా రకరకాల దరఖాస్తులు ఉన్నాయి. ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా దరఖాస్తులు ఇచ్చారు. వాటన్నిటినీ పరిశీలించి, త్వరలోనే ప్రక్షాళన చేస్తాం..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -