- Advertisement -
క్రీడాశాఖ మంత్రి శ్రీహరి
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ల నిర్వహణలో క్రీడా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. యూసుఫ్గూడలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ప్రొ బాస్కెట్బాల్ లీగ్ను శాట్జ్ చైర్మెన్ కే. శివసేనా రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. తెలంగాణ క్రీడాకారులతో కూడిన ఆరు జట్లు ఈ లీగ్లో పోటీపడుతున్నాయని బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు.
- Advertisement -