Tuesday, June 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజనాభా దామాషా ప్రకారం నిధులు

జనాభా దామాషా ప్రకారం నిధులు

- Advertisement -

వచ్చే బడ్జెట్‌ నుంచి అమలు
ప్రజల ఎజెండానే చట్టంగా పాలన
గౌడ సంఘం భవన శంకుస్థాపన సభలో
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

వచ్చే బడ్జెట్‌లో జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో అవకాశాలు పెరిగేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సమసమాజ నిర్మాణమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్మించే ఖమ్మం జిల్లా గౌడ సంఘం భవనానికి మంత్రులు పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి ప్రసంగించారు. ప్రజల ఎజెండానే చట్టంగా చేసి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్టుగా అధికారంలోకి రాగానే బీసీ కుల గణన చేసి జనాభాలో 56 శాతం ఉన్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వం లెక్క కట్టిందన్నారు, స్థానిక సంస్థల ఉద్యోగాల్లో వారికి 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. తెలంగాణ మోడల్‌ అభివద్ధి దేశవ్యాప్తంగా జరగాలి అని రాహుల్‌ గాంధీ చెబుతుంటే మొదట నవ్వారు.. ఇప్పుడు తెలంగాణ మోడల్‌ దేశానికే దిక్సూచిగా మారిందని తెలిపారు. ఏడాది లోపే గౌడ సంఘ భవన నిర్మాణం పూర్తి చేసుకోవాలని, ఇక్కడే నిరుద్యోగులకు ఒక కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సర్దార్‌ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏడాదిలోపే ఏర్పాటు చేసుకోవాలని గౌడ సంఘం నాయకులను కోరారు.
కుల వత్తులనూ కాపాడుకోవాలి : మంత్రి పొన్నం
కులవత్తిని కాపాడుకోవడంతో పాటు పిల్లలను చదువు వైపు కూడా ప్రోత్సహించాలని, విద్యతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తాటి చెట్లు ఎక్కేవారికి ప్రాణ రక్షణ కల్పించేందుకు కాటమయ్య రక్షక కిట్‌ లనుపంపిణీ చేశామని మంత్రి గుర్తు చేశారు. వేములవాడ ఆలయ సమీపంలో 45 రూములతో సత్రం నిర్మిస్తున్నామని, జోగులాంబ, కొమురవెల్లి ఆలయాల వద్ద స్థల సేకరణ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. భద్రాచలం ఆలయం వద్ద కూడా గౌడ సత్రం నిర్మించేందుకు సహకరించాలని కోరారు.
భాగస్వామిని చేసినందుకు ధన్యావాదాలు: మంత్రి పొంగులేటి
గౌడ కమ్యూనిటీ భవన నిర్మాణం కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు రాష్ట్ర రెవెన్యూ, గహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గౌడ కమ్యూనిటీ భవనానికి పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్నప్పుడు రూ.10 లక్షలు ఇస్తానని మాట ఇచ్చానని, ఇప్పుడు ఐదు రెట్లు ఇవ్వమని కోరారని, తప్పకుండా అవసరమైతే అధికంగా కూడా తన తరఫున కేటాయించి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని మంత్రి ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్‌ నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర హస్త కళల అభివద్ధి సంస్థ చైర్మన్‌ సత్యనారాయణ గౌడ్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్‌ గౌడ్‌, గౌడ సంఘం రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
తమ ప్రభుత్వ ఆదర్శంతోనే మోడీ కులగణన; మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల సర్వేను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా కుల సర్వేకు మోడీ ఆదేశించారని, ఇది తెలంగాణ ప్రభుత్వ విజయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఏ కులంలో పుట్టినా ఆ కులాన్ని గౌరవించుకోవాలని, ఇతరుల కులాన్ని కించపరుచకూడదన్నారు. గౌడ కులంలో పుట్టినందుకు గర్విస్తున్నానని చెప్పారు. ఒక్క గౌడ కులస్తులకే కాక.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని కులాలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఖమ్మం ప్రజల ఆశీర్వాదమేనన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -