రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు: మంథని నియోజకవర్గం, భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాటారం, మహాముత్తారం, మల్హర్, పలిమేల, మహాదేవపూర్ 5 మండలాల అభివృద్ధికి ఎంజిఎన్ ఆర్ఎస్ నిధుల ద్వారా రూ.4.12 కోట్ల నిధులు మంజూరు చెసినట్లుగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నవ తెలంగాణతో మాట్లాడారు. 5 మండలాలకు గాను 16 అంగన్వాడి కేంద్రాలకు నూతన భవనాలు,11 గ్రామపంచాయతీ నూతన భవనాలకు రూ.4 కోట్ల 12 లక్షలు మంజూరైనట్లుగా తెలిపారు. కాటారం మండలంలోని మద్దులపల్లి, ధర్మసాగర్ గ్రామాల్లో జీపీ భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క భవనానికి రూ.20 లక్షలు, రేగుల గూడెం, ఓడిపిలవంచ, ఇబ్రహీంపల్లి, జాదురాపల్లి గ్రామాల్లో అంగన్ వాడి కేంద్రాల నిర్మాణం కోసం ఒక్కొక్క భవనానికి రూ.12 లక్షలు, మహాముత్తారం మండలంలో బోర్ల గూడెం, మాదారం, ములుగుపల్లి, నిమ్మగూడెం గ్రామాలకు జీపీ భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క భవనానికి రూ.20 లక్షలు, గండి కామారం,గొల్లపల్లి, వజీనపల్లి, హుజూర్నగర్, బోర్ల గూడెం గ్రామాల్లో అంగన్ వాడి భవనాలకు ఒక్కొక్క భవనానికి రూ.12 లక్షలు, మహాదేవపూర్ మండలంలో రాపల్లి, కుదురుపల్లి గ్రామాలకు జీపీ బావనాల నిర్మాణం కోసం రూ.40 లక్షలు, పలుగుల, మద్దులపల్లి, అంబటిపల్లి, బెగులూరు గ్రామాలకు అంగన్ వాడి కేంద్రాలు ఒక్కొక్క కేంద్రానికి రూ.12 లక్షలు, మలహర్ రావు మండలంలో కొయ్యూరు, మల్లంపల్లి గ్రామాల్లో జీపీ భవనాల నిర్మాణం కోసం రూ.40 లక్షలు, మల్లంపల్లి, పెద్ద తుండ్ల, కిషన్ రావు పల్లి, వల్లెంకుంట, పెద్ద తుండ్ల, గాదం పల్లి గ్రామాల్లో అంగన్ వాడి కేంద్రాల నిర్మాణం కోసం ఒక్కొక్క భవనానికి రూ.12 లక్షలు, పలిమెల మండలంలో లెక్కల గడ్డ జీపీ భవనానికి రూ.20 లక్షలు మంజురైనట్లుగా మంత్రి తెలిపారు. గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాల భవనాలకు, గ్రామపంచాయతీ భవనాలు సంబంధించిన నిదులు మంజూరు చేసినందుకు ఆయా గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సబ్ డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES