- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో హనుమాన్ గుడికి చెందిన ఆవు మృతువాత చెందింది. దీంతో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన యువకుడు సుధాకర్ మాట్లాడుతూ..అనారోగ్యంలో ఆవు మృత్యువాత పడిందని తెలిపారు. ఆవు అంత్యక్రియలను భాజా భజంత్రీలతో, పూజలతో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -