న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) సహకారంతో తమ వద్ద ఉన్న అత్యవసర చమురు నిల్వలు విడుదల చేయడంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు సోమవారం సమావేశం నిర్వహించనున్నట్టు కొన్ని వార్త సంస్థలు తమ నివేదికల్లో వెల్లడించాయి.
ఈ ఆలోచనకు అమెరికాతో సహా మూడు జీ7దేశాలు ఇప్పటికే ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. అలాగే, ఇరాన్ యుద్ధం ప్రభావం చర్చించడానికి మంత్రులు, ఐఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పతిహ బిరోల్ కూడా ఒక పిలుపు ఇవ్వనున్నట్టు తెలిపాయి. సోమవారం నాటికి ఆయిల్ ధరలు 25 శాతం పెరిగిన నేపథ్యంలో ఈ వార్తలు వచ్చాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు ఉధృతం అవుతున్న కారణంగా కొన్ని ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దేశాలు తమ సరఫరాను తగ్గించడం, షిప్పింగ్ను నిలిపివేయడం వంటి అంశాలు తరువాత కూడా జీ7 దేశాల సమావేశాం గురించి వార్తలు రావడం గమనార్హం.
అత్యవసర చమురు నిల్వలపై జీ7 దేశాల చర్చలు
- Advertisement -
- Advertisement -



