- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ పండుగ, దసరా పండగ సందర్భంగా ట్రాన్స్ జెండార్ల కు టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చీరెలు అందించారు. కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 20 మంది ట్రాన్స్ జెండర్లకు పండగ సందర్బంగా చీరెలను అందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పంపరి లతా శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, తాటి లావణ్య ప్రసాద్, మామిడ్ల రమేష్, రంగా రమేష్ గౌడ్, బల్ల శ్రీనివాస్, కిరణ్, నిరంజన్,యూత్ సభ్యులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -