Monday, June 16, 2025
E-PAPER
Homeజిల్లాలుసీపీఐ మండల కార్యదర్శిగా గడ్డంపల్లి బిక్షంరెడ్డి ఏకగ్రీవం

సీపీఐ మండల కార్యదర్శిగా గడ్డంపల్లి బిక్షంరెడ్డి ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర : పెద్దవూర మండలం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శిగా పులిచర్ల గ్రామానికి చెందిన గడ్డంపల్లి భీక్షంరెడ్డి  మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా పోతునూరు గ్రామానికి చెందిన రొయ్య రాములు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం సీపీఐ మండల మహాసభ మండల కేంద్రంలోని పులిచర్ల గ్రామంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి హాజరయ్యారు. తనపై నమ్మకంతో మూడోసారి అవకాశం కల్పించిన పార్టీ నాయకులకు గడ్డంపల్లి భీక్షంరెడ్డి  కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భీక్షంరెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల అండగా ఎర్రజెండా ఉంటుందని, అదే మా ఎజెండా అని తెలిపారు. పార్టీ నిర్మాణం కోసం ప్రజాసంఘాల నిర్మాణం కోసం మేమందరం కష్టపడి పనిచేసి పేద ప్రజలకు కష్టజీవులకు కర్షకులకు రైతులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడి పోరాడుతామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -