Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఇంగ్లాండ్‌కు గంభీర్‌ పయనం

ఇంగ్లాండ్‌కు గంభీర్‌ పయనం

- Advertisement -

నేడు లీడ్స్‌లో జట్టుతో చేరనున్న చీఫ్‌ కోచ్‌
లండన్‌ :
తల్లికి అనారోగ్యంతో స్వదేశానికి వచ్చిన భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌.. తిరిగి ఇంగ్లాండ్‌కు పయనం అయ్యాడు. తల్లి సీమ గంభీర్‌ గుండెపోటుకు గురవటంతో ఈ నెల 11న ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి హుటాహుటిన గంభీర్‌ న్యూఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలోని గంగారామ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న గంభీర్‌ తల్లి ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడింది. కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు స్వదేశం వచ్చిన గంభీర్‌.. జాతీయ జట్టు బాధ్యతల కోసం సోమవారమే లండన్‌కు తిరిగి పయనం అయ్యాడు!. భారత్‌, ఇంగ్లాండ్‌ తొలి టెస్టు ఈ నెల 20న లీడ్స్‌లో ఆరంభం కానుంది. భారత్‌-ఏతో నాలుగు రోజుల టూర్‌ గేమ్‌ ముగించుకుని శుభ్‌మన్‌ గిల్‌ సేన ఇప్పటికే లీడ్స్‌కు చేరుకుంది. ఉదయం ఇంగ్లాండ్‌కు చేరుకోనున్న గంభీర్‌.. నేడు లీడ్స్‌లో జట్టుతో చేరనున్నాడు. గంభీర్‌ గైర్హాజరీలో సహాయక కోచ్‌లు రియాన్‌, సితాన్షు, మోర్కెల్‌లు జట్టు శిక్షణ బాధ్యతలను పర్యవేక్షించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad