- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని సిద్ధ రామేశ్వర ఆలయ సమీపంలో ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు. విద్యార్థులు నృత్యాలు చేస్తూ డప్పు చప్పుల ద్వారా ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -