- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది గంట విప్లవ కిరణ్ కు జిల్లా న్యాయవాదుల సహకార సొసైటీలో చోటు లభించింది. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన సొసైటీ ఎన్నికలలో జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి కృషిచేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ న్యాయవాదుల సహకార సొసైటీలో చోటు దక్కడం పట్ల పట్టణానికి చెందిన న్యాయవాదులు ఎం. కె. నరేందర్ ,జెస్సు అనిల్, జక్కుల శ్రీధర్, అశోక్ ,సతీష్ ,జగదీష్ ,రమేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -