Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుగ్యాస్ సిలిండర్ పేలి బోలెరో వాహనం దగ్దం 

గ్యాస్ సిలిండర్ పేలి బోలెరో వాహనం దగ్దం 

- Advertisement -

నవతెలంగాణ – నవాబుపేట
మండల పరిధిలోని కాకర్లపాడు సమీపంలో ఉన్న పర్వతాపూర్ మైసమ్మ దేవాలయానికి మొక్కులు తీర్చుకునేందుకు కోడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం ముస్రీషా గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి బొలెరో వాహనంలో వెళ్తున్నాడు. మరికొద్ది దూరంలో అమ్మవారి ఆలయం ఉండగా వాహనంలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై వాహనంలో ఉన్న కుటుంబ సభ్యులను కిందకి దింపి, వారి పాణాలు కాపాడారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ తో వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad