నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి కాలరీస్ డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్)గా నియమితులైన గౌతమ్ పొట్రు శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సింగరేణిభవన్లో సంస్థ సీఎమ్డీ ఎన్ బలరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. నూతన డైరెక్టర్కు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలను డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కే వెంకటేశ్వర్లు అదనంగా నిర్వహిస్తున్నారు. నూతన డైరెక్టర్కు సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కే వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్డీఎమ్ సుభాని, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) ఎన్వీ రాజశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు.
సింగరేణి డైరెక్టర్గా గౌతమ్ పొట్రు బాధ్యతల స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES