Sunday, June 1, 2025
E-PAPER
Homeక్రైమ్తాటి చెట్టు పై నుంచి పడిగీత కార్మికుని మృతి

తాటి చెట్టు పై నుంచి పడిగీత కార్మికుని మృతి

- Advertisement -

యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెలువర్తిలో ఘటన
నవతెలంగాణ-వలిగొండ రూరల్‌

తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో శుక్రవారం జరిగింది. మృతుని కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలువర్తి గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు కొమ్మగాని వెంకటేశం(43) శుక్రవారం ఉదయం రోజుమాదిరిగానే వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతుండగా కాలుజారి కింద పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం ఆయన్ను భువనగిరి ఏరియాస్పత్రికి 108లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. కాగా, మతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, వలిగొండ మండల కార్యదర్శి గాజుల ఆంజనేయులు కోరారు. వెంకటేశం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మండల నాయకులు పలుసం స్వామి, గ్రామ సొసైటీ అధ్యక్షులు పరకాల ముత్యాలు, పరకాల వెంకటేశం, మల్లేశం శ్రీశైలం ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -