- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జియో తన వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న గూగుల్ జెమినీ ప్రో ప్లాన్లో తాజాగా విడుదలైన ‘జెమినీ 3’ మోడల్ను జత చేసింది. నవంబర్ 19 నుంచి 5జీ యూజర్లు ఈ ఆఫర్ను పొందవచ్చు. రూ.35,100 విలువైన ఈ ప్లాన్ను పొందాలంటే కనీసం రూ.349 అపరిమిత 5జీ ప్లాన్ యాక్టివ్లో ఉండాలి. మై జియో యాప్లో ‘క్లెయిమ్ నౌ’ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. గూగుల్ విడుదల చేసిన జెమినీ 3 ప్రో రీజనింగ్, సంభాషణ, కోడింగ్, గణిత విశ్లేషణలో మెరుగైన ఫలితాలు ఇస్తుందని తెలిపింది.
- Advertisement -



