తన ఇంటి మీద ఇజ్రాయిల్ మిసైళ్లు జరిపిన దాడిలో పన్నెండేళ్ల యకీన్ హమ్మద్ అనే పాప శరీరం ముక్కలు ముక్కలైపోయింది. యకీన్ను చాలా సముచితమైన రీతిలో గాజా అన్నే ఫ్రాంక్ అని పిలుస్తున్నారు. నాజీ ఆక్రమణలోని ప్రాంతాల్లో సాగిన మానవ హననాన్ని గురించి రోజూ వివరాలు రాసిపెట్టిన అన్నే ఫ్రాంక్ లాగానే యకీన్ కూడా తన చుట్టూ సాగిన అమానుష కాండను రికార్డు చేసిి పెట్టింది. ఈ కాలానికి తగినట్టు ఆమె డైరీలు డిజిటల్ రూపంలో వున్నాయి. తన ప్రజలపై సాగుతున్న రాక్షసాలకు అవి ప్రత్యక్ష చరిత్ర రూపంగా నమోదై వున్నాయి.
యకీన్ వరుసగా ఒక్కో శరణార్థి శిబిరం సందర్శిస్తూ వీడియోలు తీసింది. వాటిని ఇన్స్టాలో పోస్టు చేసింది. తద్వారా గాజాలోని దారుణ వాస్తవాలను ఒక మీడియా కార్యకర్త కన్నా బాగా ప్రపంచం దృష్టికి తీసుకురాగలిగింది. మానవతా సహాయంలో కూడా ఆమె భాగం పంచుకున్నది. యుద్ధంలో నాశనమైన గాజాలో వేలాది మంది పాలస్తీనియన్లకు సహాయం అందించింది.
శిశువులపై హత్యాకాండ
యకీన్ వంటి సోషల్ మీడియా కార్యకర్తల కృషి ఫలితంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ”ప్రత్యక్ష ప్రసారంలో జాతి హత్యాకాండ” అనే కొత్త మాటను బాగా వాడుకలోకి తెచ్చింది. గాజాలో పిల్లలనే లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించడం యాదృచ్ఛికమేమీ కాదు. అమాయకులైన చిన్న పిల్లలను కూడా హమాస్తో కుమ్మక్కయినట్టు ఆరోపించే పాపిష్టి పథకం అది. యూదు జాత్యహంకార రాజకీయ వేత్తలు రగిలించిన ఉన్మాదంలో ఈ భావన లోతుగా పాతుకుపోయింది. ‘గాజాలో ప్రతి శిశువూ మన శత్రువే’ అని నెతన్యాహూ ప్రభుత్వానికి బాగా సన్నిహితుడైన మోషే ఫైగ్లిన్ బల్లగుద్ది మరీ ప్రకటించాడు. ఇలాంటి ప్రకటన ల్లోని నీచత్వం గతంలో కనీవినీ ఎరుగనిది. అలాంటి పిల్లలంద రినీ నిర్మూలించడమే ఒక సైనిక లక్ష్యంగా ప్రకటించే వరకూ వెళ్లారు కొందరు తీవ్రవాదులు.
గాజాలోని 356 చదరపు కిలోమీటర్ల భూమిని స్వాధీనం చేసుకుని ‘ప్రక్షాళన’ చేయడం కోసం సాయుధ సైన్యాలను మొహ రించడమే ఇజ్రాయిల్ తాజా పథకం అని చెబుతున్నారు. ఇందులో 70 శాతం ఇప్పటికే పాలస్తీనియన్లు ‘రావడానికి లేని ప్రాంతం’గా మార్చబడింది. ఇప్పటికే గాజా జనాభా దాదాపుగా దక్షిణ చివరన ఉన్న రఫా నగరానికి తరలించబడింది. ఈ నగరం కూడా దాదాపుగా నాశనమైంది. ఇక ఖాన్ యోనిస్, డైర్-అల్-బలాV్ా వంటి నగరాలు నిత్య విధ్వంసానికి పర్యాయ పదాలుగా మారిపోయాయి.
దీర్ఘకాలిక ఆక్రమణకే
బహుశా ఈ విధ్వంసంలో అత్యంత ఆందోళనకరమైంది ఏమంటే పాలస్తీనియన్లను బలవంతంగా ఇజ్రాయిల్ నియంత్రిత ప్రాంతాలలోకి తరలించడమే. వీటికి ”మానవతా ప్రాంతాలు” అని పేరు పెట్టడం మరీ విపరీతమైన విషయం. ఇజ్రాయిల్ ఆమో దంతో వచ్చిన ప్రైవేటు సహాయ సంస్థలు అక్కడ రేషన్ ప్యాకె ట్టులు ఇస్తాయి. రాజకీయమయమై సైనికీకరించబడిన సహాయం కూడా వారిపై ఒత్తిడికి ఒక సాధనంగా ప్రయోగించబడుతున్నది. పాలస్తీనియన్లను అంతకంతకూ పరిమిత ప్రాంతాలకు పరిమితం చేసి అక్కడ అన్ని అత్యవసర అంశాలనూ ఇజ్రాయిల్ గుప్పిట్లో పెట్టడం ద్వారా సుదీర్ఘ కాలం పాటు ఆక్రమణ కొనసాగించడానికి ఈ పథకం వీలు కల్పిస్తుంది. ఈ సైనికీకృత సహాయ కార్యక్ర మాన్ని అమలు చేసేందుకోసం ఐక్యరాజ్యసమితి పరిధి వెలుపలక సహాయ సంస్థను నెలకొల్పడానికి డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా బాధ్యత తీసుకున్నట్టు చెబుతారు.
నెతన్యాహూ మంత్రివర్గం ఈ సైనిక కార్యక్రమానికి ‘విధ్వంస రథం’ అని పేరు పెట్టింది. అయితే ఇది నిజంగా బందీలను విడుదల చేసేలా హమాస్పై ఒత్తిడి తేవడానికి ఉద్దేశించిందా లేక సామూహిక శిక్ష అమలు చేయడానికి తలపెట్టిందా అన్నది అక్కడ సాగే సామూహిక విధ్వంసం బట్టి ఎవరైనా చెప్పొచ్చు.
పశ్చిమ దేశాల్లో మార్పు వున్నా…
ఏమైనా సైనిక చర్య తీవ్రత పశ్చిమ దేశాల స్వరం ఎంతో కొంత మారేలా చేసింది. బ్రటిన్, ఫ్రాన్స్, కెనడాలు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ ఈ మానవీయ సంక్షోభం సహించరానిద న్నారు. ఆహార సహాయ పథకం అరకొరగా వుందని విమ ర్శించాయి. ”ఇజ్రాయిల్ సైనికాధికారులు వినియోగించిన జుగుప్సాకర భాషను మేము ఖండిస్తున్నాం. బలవంతంగా శాశ్వత తరలింపునకు గురి చేయడం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.” అన్నాయి. హమాస్ అక్టోబరు 7 దాడి తర్వాత ఇజ్రాయిల్ ఆత్మరక్షణ హక్కును సమర్థించిన వారు ఇప్పుడు గాజాలో సైనిక కార్యకలాపాల విస్తరణను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.
యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వన్ డర్ లియాన్ మానవతా సహాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీ యం చేయరాదన్నారు. రెండు దేశాల సిద్ధాంతం మాత్రమే ఆమోదయోగ్య పరిష్కారమన్నారు.
అయినా సరే అమెరికా నుంచి వ్యతిరేకత లేని నేపథ్యంలో మరీ ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ పెదవి కదపని పరిస్థితుల్లో నెతన్యాహూ ఈ సలహాలు పాటిస్తాడా అనేది అనుమానమే.
ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో ఐరాస మానవ హక్కుల ప్రత్యేక సంధానకర్తగా వున్న ఫ్రాన్కెస్కా అల్బెనీస్ ఈ విషయం మరింత సూటిగానే చెప్పారు : ”అనేక సభ్య దేశాలు ఉదాసీనంగా వుంటున్నాయి. మరీ ఎక్కువనుకుంటే ఇజ్రాయిల్ నేరపూరత చర్యలకు సహకరిస్తూ కుమ్మక్కు అవుతు న్నాయి.” ప్రత్యేకంగా పశ్చి మ దేశాలు, కొన్ని గల్ఫ్ దేశాల గురించి ఆమె ప్రస్తావిం చారు. ఇజ్రాయిల్ ఒక పీడక దేశంగా తయారయ్యే ప్రమాదం గురించి కూడా ఆమె హెచ్చరించారు. ఎందుకంటే అది పాలస్తీనియన్ల పైనేగాక ఐక్యరాజ్యసమితి మీద కూడా నిరంతరం దాడి చేస్తున్నది.
ఉదాసీనతే మూల కారణం
ఈ విషాద పరిస్థితికి కారణం ఉదాసీనతే. అది ఉద్దేశ పూర్వకమైనది కావచ్చు, కాకపోవచ్చు. 1948లో ఇజ్రాయిల్ ఏర్పాటుకై ఐరాస చేసిన తీర్మానాన్ని ఆ విధంగా బలపర్చిన దేశాల ఉదాసీన వైఖరి నుంచే ఉత్పన్నమైంది. జాతి ప్రక్షాళన అనే యూదు జాత్యహంకార సైద్ధాంతిక భావజాలం మొదట్లోనే ప్రత్యక్ష మైంది. యూదు చరిత్రకారుడు పాపే ”పాలస్తీనాలో జాతి ప్రక్షా ళన” అన్న తన పుస్తకంలో దీని వెనక ఉద్దేశాలను 1948 నక్బా నుంచి వివరంగా పొందుపర్చారు. ఆయన కుటుంబం కూడా ఈ మారణకాండలో నష్టపోయింది. ఇప్పుడు ఈ పథకం పూర్తిగా విప్పారుతోంది. గాజాను పర్యాటక తీరంగా మార్చాలనే డోనాల్డ్ ట్రంప్ విస్తార పథకం పుండు మీద కారం చల్లడం వంటిదే.
అక్టోబరు 7 తర్వాతనే ఇజ్రాయిల్ ఈ ఉన్మాద ప్రచారం ఎందుకు అమలు చేస్తున్నదనేది మనం అర్థం చేసుకోవాలి. హమాస్ సైనిక సామర్థ్యం ఎంత వున్నప్ప టికీ వారు ఇజ్రాయిల్ భద్రత అభేద్యమైనదనే కట్టుకథను సవాలు చేశారు. పశ్చిమ దేశా లు మరీ ముఖ్యంగా అమెరికా బాగా చురుగ్గా సహకరించి వుండక పోతే ఈ ప్రచారం సాధ్యమై వుండేది కాదు. ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్య రెండు నాగరిక రాజ్యాల తరహాలో పరస్పర సంబంధాలు ఏర్పడకుండా కేవలం సైనిక బలం ఒక్కటే ఎన్నటికీ స్థిరశాంతి నెలకొల్పజాలదు.
హిందూత్వ శక్తుల వత్తాసు
మనం భారత దేశంలో చూస్తున్నది మాత్రం కనీవినీ ఎరుగ నిది. చారిత్రికంగా భారతదేశ నాయకత్వం గాంధీ నుంచి నెహ్రూ వరకూ పాలస్తీనియన్ పోరాటానికి సుస్పష్టంగా మద్దతునిచ్చారు. ఒక జాతీయ ఏకాభిప్రాయం వుండేది. ఏమైనా హిందూత్వ శక్తుల పెరుగుదల దాన్ని పూర్తిగా మార్చేసింది. హిందూత్వకూ యూదు జాత్యహంకారానికి ఒకే ఉమ్మడి లక్షణాలుంటాయి. మతపరమైన అస్తిత్వ ఆధారిత జాతి భావన అసలు రాజ్యం స్వభావాన్నే రూపాం తరం చేస్తున్నది. వారు సైద్ధాంతిక భావాత్మక నేస్తాలు. ఆరెస్సెస్ తొలి రోజుల నుంచి దాని నాయకులు యూదు జాత్యహంకారాన్ని కీర్తిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇస్లామోఫోబియా ఆజ్యం పోయడంతో ఇప్పటి హిందూత్వ ఇజ్రాయిల్ విధ్వంసక చర్యలను వత్తాసు నిస్తున్నది. ఈ కూటమి ఘర్షణను కొత్త నిర్వచనమి స్తున్నది. దీన్ని పాలస్తీనా విమోచన పోరాటంగా గాక యూదు లకూ ముస్లిం పాలస్తీనియన్లకూ మధ్య మత యుద్ధంలా చెబుతున్నది. మోడీ భారత్కూ నెతన్యాహూ ఇజ్రాయిల్కూ మధ్యన సైనిక భద్రతా భాగస్వామ్య సంబంధాలు పెరుగుతున్న కొద్దీ ఇది మరింత ఉధృతమవుతున్నది.
ఇక్కడ ఏం జరగాలన్నది స్పష్టం. పాలస్తీనా పట్ల అంత ర్జాతీయ సంఘీభావం ఇనుమడిస్తున్నది. పశ్చిమ దేశాల స్పంద నలో కూడా మార్పు సంకేతాలున్నాయి. 21వ శతాబ్దంలో గాజా అనేది ఆధునిక నాగరికతకు అస్తిత్వ పరీక్షగా మారుతున్నది. భారతీయులు ఇప్పుడు ఇజ్రాయిల్ ద్వేషపూరిత చర్యలను ఖండిం చేలా మోడీ సర్కారుపై ఒత్తిడి పెంచి సమీకరణ చేయవలసి వుంటుంది. ఈ బాధ్యత మనందరి పైనా వుంది.
పీపుల్స్ డెమోక్రసీ సౌజన్యంతో..
ప్రత్యక్ష ప్రసారంలో జాతి హత్యాకాండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES