- Advertisement -
నవతెలంగాణ – హలియా
నల్గొండ జిల్లా విషాద సంఘటన చోటు చేసుకుంది. హాలియాలోని శివాలయం సమీపంలో ఉన్న సాగర్ ఎడమ కాలువ వంతెనపై టీవీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో వాహనంపై వెళ్తున్న భార్యా భర్త ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. మృతులు పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామనికి చెందిన వెంకటయ్య (55) మల్లమ్మ(45)గా స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా ప్రాథమిక సమాచారం నమోదు చేసుకున్నారు. మృతుల కుటుంబాల ఫిర్యాదు మేరకు హాలియా సీఐ సతీష్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకొని పీఎస్కు తరలించారు.
- Advertisement -



