అనుష్క శెట్టి నటించిన కొత్త ‘ఘాటి’. విక్రమ్ ప్రభు మేల్ లీడ్గా నటించిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత రాజీవ్ రెడ్డి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ఒక ఫిమేల్ సూపర్ స్టార్తో కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాల నేది మెయిన్ ఐడియా. ‘కర్తవ్యం’ తర్వాత ఆ స్కేల్లో మళ్ళీ సినిమా రాలేదు. ఇప్పుడున్న స్టార్స్లో అనుష్కకి అలాంటి స్టార్డమ్ ఉంది. ఇది కంప్లీట్గా ఫిక్షనల్ స్టోరీ. దీనికి ఎలాంటి రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ లేదు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్స్లో ఎక్కువగా షూట్ చేశాం. ఒరిస్సాలో షూట్ చేసినప్పుడు అక్కడ లోకల్స్ చాలా సపోర్ట్ చేశారు. విక్రమ్ ప్రభు అద్భుతంగా నటించాడు.
దీన్ని తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం. విక్రమ్ ప్రభు ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా మాకు ప్లస్ అవుతుంది. అనుష్క క్యారెక్టర్ని టీజర్, ట్రైలర్లో ఎంత ఇంటెన్సిటీగా చూసారో, సినిమాలో కూడా అంతే ఇంటెన్స్గా ఉంటుంది. ఇది ఫుల్ యాక్షన్ సినిమా. క్రిష్ మార్క్ డ్రామా ఉంటుంది. అనుష్క పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇందులో విజువల్స్ అవుట్ స్టాండింగ్గా ఉంటాయి. ఆడియన్స్కి విజువల్ ట్రీట్ ఉంటుంది. క్రిష్, అనుష్క కాంబినేషన్లో వచ్చిన ‘వేదం’ చాలా పెద్ద హిట్. ఆ అంచనాల్ని ఈ సినిమా రీచ్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. దీనికి పార్ట్ 2 అనే ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు. సినిమా ఫైనల్ అవుట్ చూసాక మేం చాలా హ్యాపీగా ఉన్నాము. మేము ఏదైతే అనుకున్నామో అది స్క్రీన్ మీదకి అద్భుతంగా వచ్చింది. సాగర్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. బ్యాగ్రౌండ్ స్కోరు చాలా అద్భుతంగా వచ్చింది. వరుణ్ తేజ్తో చేస్తున్న సినిమా దాదాపు 80% షూటింగ్ కంప్లీట్ అయింది. అది చాలా మంచి హర్రర్, కామెడీ ఎంటర్టైనర్. ‘అరేబియన్ కడలి’ సీజన్ 2 స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే అమెజాన్కి ఒక ఒరిజినల్ ఫిలిం చేయబోతున్నాం. వీటితోపాటు మరికొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. త్వరలోనే వాటి గురించి తెలియజేస్తాను.