ఆర్టిఐ నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, చింతల కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు.
మహిళ దినోత్సవం లాగే బాలికల దినోత్సవానికి ప్రాధాన్యత ఇవ్వాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ లు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.శనివారం మాట్లాడారు ఆడపిల్లని మా ఇంటి మహాలక్ష్మిని పిలుస్తారు.స్త్రీని దేవతతో పోల్చుతారు.కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఇందుకు భిన్నంగా ఉన్నాయన్నారు.నిత్యం వారిపై ఎదో ఓక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు.వారిపై ఇంటా బయటా అనేక ఆంక్షలు ఉంటాయని,ఆడపిల్లల జీవించే హక్కు మగపిల్లల జీవించే హక్కు లాగా గౌరవింపబడడం లేదన్నారు.చాలా దేశాల్లో అమ్మాయి పుట్టాలన్న కోరిక కంటే అబ్బాయి పుట్టాలన్న కోరిక ఎక్కువగా ఉంతుందని తెలిపారు.అమ్మాయి పుడుతుందని తెలిసినప్పుడు అబార్షన్ చేయించుకోడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు.కొన్ని దేశాల్లో ఒక వేళ ముందు అమ్మాయో, అబ్బాయో తెలియకపోతే అబ్బాయి కావాలనుకున్నప్పుడు అమ్మాయి పుడితే అమ్మాయిని చంపేయడానికి కూడా వెనుకాడటం లేదన్నారు.అమ్మాయిలకి సురక్షితంగా ఉండే వాతవరణం ఉండి, చక్కని చదువు ఉండి, ఆరోగ్యకరమైన జీవితం గడపగలిగే అవకాశం ఉంటే వారు తల్లులుగా, వ్యాపార వేత్తలుగా, గృహిణులుగా, రాజకీయ నేతలుగా ఎదిగి దిశానిర్దేశం చేయగలుగుతారని తెలిపారు.కానీ ప్రపంచవ్యాప్తం గా చాలా మంది ఆడపిల్లలకి అవన్నీ లభిచటం లేదు. వారి ఎన్నో హక్కులు వారు అనుభవించలేకపోతున్నారని తెలిపారు.
ప్రతి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుతారు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యత బాలికల,దినోత్సవానికి కూడా ఇవ్వాలి. ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వాలు అన్ని వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు
మహిళ దినోత్సవం లాగే బాలికల దినోత్సవానికి ప్రాధాన్యత ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES