స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వట్టి శ్రీను
నవతెలంగాణ – చండూరు
మండలంలో జోగుగూడెం గ్రామ అభివృద్దే తన లక్ష్యమని, ఒకసారి సర్పంచ్గా అవకాశం ఇస్తే అభివృద్ధి పనులుచేసి చూపిస్తానని జోగుగూడెం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వట్టి శ్రీను అన్నారు. మంగళ వారం ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ.. ఈనెల 11న నిర్వహించినున్న సర్పంచ్ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ప్రభుత్వం నిధులను పారదర్శకంగా వినియోగించి ప్రతి కుటుంబం అభివృద్ధి చెందేలా పనిచేస్తానన్నారు. అభివృద్ధి కోసం మీరు వేసే ఓటు భవిష్యత్తును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతుందన్నారు. సేవలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతున్నారని, ఈ మద్దతు గెలుపు వచ్చేవరకు ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో యాదయ్య, ఉంగరాల రావులమ్మ శైలజ చొప్పరి యాదయ్య వట్టి మారయ్య, నాగరాజు లింగస్వామి ప్రవీణ్ వేరే సురేష్ చంద్రయ్య నరసింహ పెద్దలు, ఉట్టి లింగస్వామి, సుజాత రమేష్, తదితరులు పాల్గొన్నారు.
జోగు గూడెం సర్పంచిగా అవకాశం ఇవ్వండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



