Tuesday, March 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫిబ్రవరి 4న పాతబస్తీ మెట్రో పనులపై పీపీటీ ఇవ్వండి: తెలంగాణ హైకోర్టు

ఫిబ్రవరి 4న పాతబస్తీ మెట్రో పనులపై పీపీటీ ఇవ్వండి: తెలంగాణ హైకోర్టు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మెట్రోరైలు ఫేజ్ -2 నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. చారిత్రక నిర్మాణాలు దెబ్బతినేలా మెట్రో పనులు చేస్తున్నారంటూ పిల్‌ దాఖలైంది. పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక నిర్మాణాలకు ఎలాంటి నష్టం జరగడం లేదని ఏఏజీ వాదనలు వినిపించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో చూపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందుకు సీజే ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 4న పాతబస్తీ మెట్రో పనులపై పీపీటీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -