నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అన్నీ ఆర్టీసీ సంఘలు ప్రభుత్వానికి, ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వాలని పలు సంఘాలతో కూడిన జేఏసీ విజ్ఞప్తి చేసింది. మే నెలో ఏడో తేదీన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయాలని పిలుపునిచ్చింది. యూనియన్లకు అతీతంగా ఇందులో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవిధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు అన్నీ యూనియన్లు సమ్మె నోటీసు ఇవ్వాంటూ జేఏసీ తరపున చైర్మెన్ ఈదురు వెంకన్న, వైస్ఛైర్మెన్ థామస్రెడ్డి, కన్వీనర్ మౌలానా, కోకన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి యాదగిరి లేఖలు రాశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘సమస్యలపై సమ్మె నోటీసు ఇవ్వండి’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



