- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని పిప్రీ గ్రామ శివాయుత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద గురువారం చిన్నారులు భరతనాట్యం ప్రదర్శించినారు. అత్యంత మంత్రముగ్ధులను చేసే ఈ భరతనాట్య ప్రదర్శన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గ్రామ బిజెపి నాయకులు సుంకం భూషణ్ చిన్నారులకు బహుమతులు అందజేసినారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -