Tuesday, June 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన జిజెసి పరకాల విద్యార్థులు..

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన జిజెసి పరకాల విద్యార్థులు..

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
నేడు ప్రకటించిన ఇంటర్  సప్లమెంటరీ పరీక్షా ఫలితాల్లో పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అత్యుత్తమ ఫలితాలను సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ కె సంపత్ కుమార్ అన్నారు.జనరల్ విభాగంలో ద్వితీయ సంవత్సరంలో 14 మంది విద్యార్థులకుగాను, 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరంలో 20 మంది విద్యార్థులకు గాను, 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో  విద్యార్థులు 98 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కే సంపత్ కుమార్ మాట్లాడుతూ… తమ కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను, ఇప్పటివరకు 116 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం జరిగిందన్నారు.. అధ్యాపకులతో కలిసి,గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని విద్యార్థులను కోరడం జరుగుతుందన్నారు…  తమ కళాశాలలో జనరల్ విభాగంలో ఎంపీసీ, బైపిసి, సి ఈ సి, హెచ్ ఈ సి, కోర్సులు, ఒకేషనల్ విభాగంలో   ఏం  ఎల్ టి, ఎంపీ హెచ్ డబ్యు(ఎఫ్), ఎల్ ఎం డి టి, పి ఎస్ టి టి,ఏం ఈ కోర్సులు తెలుగు, ఇంగ్లిష్ మీడియాలలో అందుబాటులో ఉన్నాయని అన్నారు.. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేయడంతో పాటు, స్కాలరిప్ సౌకర్యం, విశాలమైన క్రీడా మైదానం, ప్రశాంతమైన వాతావరణంలో, విశాలమైన తరగతి గదులలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు.. ఇంటర్మీడియట్ విద్యతో పాటు,ఎప్ సెట్, ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు కోచింగ్ ఇస్తూ, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో  ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు, ప్రభుత్వం ఉచితంగా ఇంజనీరింగ్, వైద్య విద్యను చదివే అవకాశం కల్పిస్తుందన్నారు..అనంతరం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ కే సంపత్ కుమార్, అధ్యాపకులు అభినందించారు… ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -