ఆర్అండ్ బి, రెవెన్యూ అధికారులతో రివ్యూ..
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని పట్టణంలోని మంథని గోదావరి బ్రిడ్జి, శ్రీపాద రింగ్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో ఆర్ అండ్ బి,రెవెన్యూ అధికారులను, కంపెనీ ప్రతినిధులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. రూ.4.50 కోట్లతో మంజూరైన ఆర్ అండ్ బి అతిథిగృహానికి స్థల సేకరణ చేయాలని, వెంటనే పనులను వేగవంతం చేయాలన్నారు. మంథని మున్సిపాలిటీలో రూ.10 కోట్లతో మంజూరైన అన్ని కులాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కు స్థలం లేని వాటికి వెంటనే ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పనులు చేసుకోవడానికి అందజేయాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. అలాగే హమాలీ సంఘం, ఆటో కార్మికులకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి వారికి ఇంటి నిర్మాణం చేసుకునే విధంగా ఖాళీ స్థలాలను గుర్తించాలని తెలిపారు.
గోదావరి బ్రిడ్జి, శ్రీపాద రింగ్ రోడ్డు పనులు వేగవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES