- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గ దేవి మండపాల నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరించిన మండపాలలో దుర్గాదేవిని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో పట్టు వస్త్రాలతో అలకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుంకుమార్చనతో పాటు ప్రసాద వితరణ చేసారు. ఈ కార్యక్రంలో భక్తులు అమ్మవారి మలధారణ స్వాములు పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని విగ్రహాలను మంగళహారతులు భాజా భజంత్రీల తో తీసుకువచ్చి మండపల్లోకి చేర్చారు.
- Advertisement -