- Advertisement -
– క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అంచనా
న్యూఢిల్లీ : వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు 12-15 శాతం మేర తగ్గవచ్చని క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. పసిడి గరిష్ట స్థాయికి చేరుకోవడంతో కరెక్షన్ ఉండొచ్చని పేర్కొంది. అయితే మధ్యకాలిక, దీర్ఘకాలిక కాలంలో లోహాలపై అర్థవంతమైన రాబడులు ఉండొచ్చని తెలిపింది. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం.. మంగళవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.70 పెరిగి రూ.99,060గా పలికింది. 22 క్యారెట్ల పసిడిపై రూ.200 పెరిగి రూ.90,950గా నమోదయ్యింది. కిలో వెండిపై రూ.100 పెరిగి రూ.1,00,100గా చోటు చేసుకుంది.
- Advertisement -